
రైతు బంధు నిధుల విడుదల
రూ. 2 లక్షల రుణమాఫీ పై కార్యాచరణ
ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణిసీఎం
రేవంత్ రెడ్డి ఆదేశం
ఇప్పటి వరకూ పాత పద్ధతే
వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, డిసిసెంబర్ 11 : రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటుజరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్బంగా సి.ఎం. శ్రీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు సోమవారం నుంచే రైతు బంధు నిధులను సంబంధిత రైతుల ఖాతాల్లో వేసే ప్రక్రిను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా పంట పెట్టుబడి సహాయం అందించాలని అన్నారు. ఇప్పటి వరకూ పాత పద్ధతే కొనగించి వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.


రూ. 2 లక్షల రుణ మాఫీపై కార్యాచరణ
- ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం లోని రైతులకు రూ.2లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకు కార్యాచరణ ప్రణాలికను రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.

ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి
ప్రస్తుతం జ్యోతి రావు పూలే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను ఇకనుండి ప్రజావాణిగా పిలవాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రజావాణిని ఇకనుండి ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో రెండు రోజులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం వంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటల లోపు జ్యోతి రావు పూలే ప్రజా భవన్ కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటు చేయాలని,ప్రజల సౌకర్యార్థం తీగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

