
నేను అదే చేసి ఉంటే… కేటీఆర్ జైల్లో ఉండేవారు: రేవంత్ రెడ్డి
- కక్షపూరిత రాజకీయాలకు తాము దూరమన్న రేవంత్ రెడ్డి
- తనను జైల్లో పెట్టి వేధించారని మండిపాటు
- కేసీఆర్, కేటీఆర్ లను జైల్లో వేయాలని చాలా మంది అడుగుతున్నారని వ్యాఖ్య
హైదరాబాద్, మార్చి 28, 2025: కక్షపూరిత రాజకీయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇలాంటి రాజకీయాలకు దూరమని, తాము కూడా కక్షపూరిత రాజకీయాలను చేస్తే ఇప్పటికే కేటీఆర్ చంచల్ గూడ జైల్లో ఉండేవారని చెప్పారు. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే రూ. 500 జరిమానా విధిస్తారని… కానీ, అప్పట్లో ఎంపీగా ఉన్న తాను డ్రోన్ ఎగరవేశానని జైల్లో పెట్టి వేధించారని మండిపడ్డారు. తన కూతురు పెళ్లికి కూడా తాను బెయిల్ పై వచ్చి మళ్లీ జైలుకు వెళ్లానని తెలిపారు.
శాసనసభలో కేటీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు..ప్రతీకార రాజకీయాలను తాను కూడా చేయాలనుకుని ఉంటే…..మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే… వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదు..ఈ పాటికే కొందరు జైల్లో ఉండేవారని రేవంత్ చెప్పారు. చంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు….కేసీఆర్, కేటీఆర్ లను జైల్లో వేయాలని తమను చాలా మంది అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులు బనాయించి, వాళ్లను జైళ్లకు పంపే నీచ రాజకీయాలను తాను చేయనని చెప్పారు.
డఅధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు..16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా మమ్మల్ని నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదు..

లైట్లు ఆన్ లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారు..కరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారు..వాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు..అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నా..నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు..చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు..రాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదా..అయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదు..నిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారు..కానీ ఆ పని నేను చేయలేదు.. మేం విజ్ఞత ప్రదర్శించాం..ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించా..సొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించా..ఎవరివి కక్ష సాధింపు చర్యలో
తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది.. అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు..