
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్, నవంబర్ 17
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు..
మేనిఫెస్టో అంశాలు ఇవే..
తెలంగాణా కాంగ్రెస్ కమిటీ
అసెంబ్లీ ఎన్నికలు-2023
మేనిఫెస్టో ముఖ్యాంశాలు (ఆరు గ్యారంటీలకు అనుబంధం)
- తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలనను అందిస్తాం.
- ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజూ “ప్రజా దర్బార్” నిర్వహిస్తాం.
- తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ అమరవీరుల తల్లి/తండ్రి/భార్య కు రూ. 25000 ల నెలవారీ గౌరవ పెన్షన్ను, మరియు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం
- తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసి, వారికి 250 గజాల ఇళ్ల స్థలాలను కేటాయిస్తాం.
- రైతులకు రూ. 2 లక్షల పంట ఋణ మాఫీ చేస్తాం.
- వడ్డీలేని పంట రుణాలను రూ.3 లక్షల వరకు అందచేస్తాం.
- వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంట్.
- అన్ని ప్రధాన పంటలకు సమగ్ర భీమా పధకాన్ని అందిస్తాం.
8ఎ. ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మా సిటీలను రద్దు చేస్తాం.
- కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి మరియు అవకతవకలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తాం.
- మెగా డీఎస్సీ ని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను
6 నెలల లోనే భర్తీ చేస్తాం.
- వార్షిక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి పారదర్శకంగా నిర్ణీత కాలంలో 2 లక్షల ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం.
- ప్రతి విద్యార్థి, విద్యార్దినులకు ఫ్రీ (ఇంటర్నెట్) వైఫై సౌకర్యం కల్పిస్తాం.
- విద్యారంగానికి బడ్జెట్ లో ప్రస్తుత వాటా 6% నుండి 15% వరకు పెంచుతాం.
- అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని రూ.10,000 లకు పెంచుతాం.
- మూతబడిన దాదాపు 6 వేల పాఠశాలలను తిరిగి మెరుగైన సదుపాయాలతో పునఃప్రారంభిస్తాం.
- బాసర ట్రిపుల్ ఐటి (IIIT) తరహాలో మరో 4 ట్రిపుల్ ఐటి లను ఏర్పాటు చేస్తాం
- ఆరోగ్యశ్రీ పధకం పరిమితి 10 లక్షలకు పెంచి మరియు ఈ పథకం
మోకాలు సర్జరీకి కూడా వర్తింప చేస్తాం. 18. ధరణి పోర్టల్ స్థానంలో “భూమాత” పోర్టల్ను ప్రవేశ పెట్టి భూహక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తాం.
- “ల్యాండ్ కమీషన్” ఏర్పాటు చేసి, అన్ని భూహక్కుల సమస్యలను పరిష్కరిస్తాం.
- భూ సంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన దాదాపు 25 లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి భూహక్కులను లబ్దిదారులకు కల్పిస్తాం.
- 73, 74 వ రాజ్యాంగ సవరణల ప్రకారము, మూడంచెల స్థానిక సంస్థలను బలోపేతం చేసి, విధులు, నిధులు మరియు నిర్వహణ భాద్యతలను అప్పగిస్తాం.
- గ్రామ పంచాయితీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం నెలకు రూ. 1500 ఇస్తాం. అదే విధంగా మాజీ సర్పంచ్, ఎంపీటీసీ మరియు జడ్ పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్ అందచేస్తాం.
- ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ పెండిరగ్లో వున్న మూడు DA లను తక్షణం చెల్లిస్తాం.
- ప్రస్తుతం ఉన్న CPS విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ (OPC) విదానాన్ని అమలు చేస్తాం.
- ప్రభుత్వ ఉద్యోగులకు, RTC సిబ్బందికి కొత్త PRC ప్రకటించి 6 నెలలలోపు సిఫారసులను అమలు చేస్తాం.
- ఆర్టీసీ సిబ్బందికి రెండు పిఆర్సి బకాయిలను వెంటనే చెల్లిస్తాం.
- ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి రూ. 12000 లు ఆర్థిక సహాయం అందచేస్తాం.
- పెండింగ్ లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలానాలు 50% శాతం రాయితీతో (one time Settlement)
- బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తాం.
- ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తాం.
- బీసీల “కుల గణన” చేసి, జనాబా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తాం.
- సంచార జాతులకు విద్య, ఉద్యోగ అవకాశాలతో 5% రిజర్వేషన్ కల్పిస్తాం.
33. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద ‘బిసి భవన్’ ఏర్పాటు చేస్తాం.
- జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతాం.
- అన్ని వెనుకబడిన కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తగు నిధులను కేటాయిస్తాం.
- వెనుకబడిన తరగతులకు (బీసి) సబ్ ప్లాన్ అమలు చేస్తాం.
- ఈబీసీ ల కొరకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం.
- సరిపడా నిధులతో మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం.
- నిరుపేద హిందూ మరియు మైనారిటీ ఆడపడుచులకు వివాహ సమయంలో ఇచ్చే రూ. 1,00,000 తో పాటూ ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం ఇస్తాం.
- సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల విధానాన్ని పునః పరిశీలించి సరళీకృతం చేస్తాం.
- సింగరేణి సంస్థ ప్రయివేటీకరణకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించదు.
- బీడీ కార్మికులకు జీవిత భీమా, ఈఎస్ఐ పరిధిలోకి తెస్తాం.
- ప్రమాదవశాత్తు చనిపోయే గీత కార్మికులకు రూ. 10 లక్షల వరకు, ఎక్స్రేషియా పెంచుతాం.
- యాదవ, కుర్మలకు దళారీలు లేకుండా నేరుగా రూ. 2 లక్షల గొర్రెల పెంపకం కోసం అందచేస్తాం.
- రాజస్థాన్ తరహాలో అసంఘిటిత కార్మికులకు, ఉదా: భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, కాబ్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో (Gig & plat form) వారికి సామాజిక భద్రత కల్పిస్తాం.
- స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో రుణ పరిమితిని రూ. 10 లక్షల వరకు పెంచుతాం.
- పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయంతో కూడిన “బంగారు తల్లి” పధకాన్ని పునరుద్ధరిస్తాం.
- 18 సంవత్సరాలు పైబడి, చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందజేస్తాం.
- అన్ని జిల్లా కేంద్రాలలో “ ఓల్డ్ ఏజ్ హెూమ్స్” ఏర్పాటు చేస్తాం.
- సుదీర్ఘ కాలంగా పెండింగ్లో వున్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం.
- మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 5 లక్షల నగదు ఇస్తాం.
- రాష్ట్రంలో వున్న ప్రజా పంపిణీ రేషన్ డీలర్స్కు రూ. 5 వేలు గౌరవ వేతనం ఇస్తాం.
- ఇకపై తెల్ల రేషన్ కార్డులపై ఇకనుండి సన్న బియ్యం సరఫరా చేస్తాం.
- గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం.
- మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం.
- దివ్యాంగుల నెలవారీ పెన్షన్ ఇకనుండి రూ.6000 లకు పెంచుతాం.
- ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ను ఏర్పాటు చేస్తాం.
- హెూమ్ గార్డుల వేతన సవరణలతో పాటూ వారి అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం.
- నిరుద్యోగులకు ఉపాధి కల్పనగా ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చి, చిన్న మరియు మధ్య తరగతి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు అందచేస్తాం
- అంగన్వాడీ టీచర్లకు నెలసరి వేతనం 18000 లకు పెంచుతూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రతను కల్పిస్తాం.
- 50 సం. దాటిన జానపద కళాకారులకు నెలకు రూ.3000 లు పెన్షన్ చెల్లిస్తాం.
- ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్గా గుర్తించి పూర్తిస్థాయిలో ఆధునీకరించి పూర్వ వైభవాన్ని తీసుకువస్తాం.
- ఎల్బీ నగర్ – ఆరాంఘర్ – మెహదీపట్నం – బీహెచ్ ఇఎల్ రూట్లలో కొత్త మెట్రో మార్గాలను నిర్మిస్తాం.
- హైదరాబాద్ నగరాన్ని ముంపు రహిత నగరంగా తీర్చిదిద్ది నాలాల ఆధునీకరణ చేపడతాం.
- రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు మరియు గ్రామ పంచాయితీలలో ఆస్తి పన్ను, ఇంటిపన్ను బకాయిలపై వున్న పెనాల్టీని
- రద్దు చేస్తాం. 66. నగర పాలక మరియు మున్సిపాలిటీ కేంద్రాలలో అన్నీ ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం.