
మరో మూడురోజుల పాటు అందుబాటులో నర్సరీ మేళా
మొక్కల ప్రియుల నుంచి అనూహ్య స్పందన
హైదరాబాద్, ఆగస్టు 30
మరో మూడు రోజుల పాటు నర్సరీ మేళా అందుబాటులో ఉంటుందని ఆల్ ఇడియ హార్టీకల్చర్ మేళా ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్ తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీ వరకూ ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఈ షో ప్రకృతి, మొక్కల ప్రేమికులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

నెక్లెస్రోడ్ పీపుల్స్ప్లాజాలో ఆలిండియా హార్టికల్చర్, అగ్రికల్చర్షో షురూ అయింది. ఈ ప్రదర్శన లో వర్టీకల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్, టెర్రస్ గార్డెనింగ్, వంటి నూతన టెక్నాలజీ ఈ ప్రదర్శన లో ప్రత్యేకంగా నిలిచాయి. కిచెన్, అవుట్ డోర్, ఎక్ సోటిక్ టిక్, బల్బ్, సీడ్, సీడ్ లింక్స్ ,ఇండోర్, ఆడినియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ప్రదర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా డార్జిలింగ్, కోల్కతా, ఢిల్లీ, హర్యానా, ముంబయి, బెంగుళూరు, పూణే, షిర్డీ, కడియం, చెన్నై తెలంగాణ, ఆంధ్రా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 150స్టాల్స్ ప్రదర్శిస్తున్నారు.


బోన్సాయ్ వృక్షాలు, పూలు, పండ్ల మొక్కలు అబ్బురపరుస్తున్నాయి. గార్డెనింగ్ బీజీగా ఉండే నగర వాసులకు మానసిక ఒత్తిడి తగ్గించి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయని షో ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్ అన్నారుఈ షో లో మెడిసినల్ ప్లాంట్స్, రకరకాల పండ్లు, పూల మొక్కలు, అగ్రికల్చర్, హార్టీకల్చర్కు అవసరమైన పనిముట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్టాల్స్ లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో నర్సరీ స్టాల్స్ తో పాటు మెడిసినల్ ప్లాంట్స్ , ఫ్రూట్, ఫ్లవర్ ప్లాంట్స్, బల్బ్స్ ప్రదర్శిస్తున్నట్లు వివరించారు.
