
ఆకట్టుకుంటున్న గ్రాండ్ నర్సరీమేళా
నేడు, రేపు అందబాటులో నర్సరీమేళా
హైదరాబాద్, సెప్టెంబర్ 01
వర్షంలోనూ ప్రకృతి ప్రియులు మొక్కలు తీసుకోవడానికి నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజాకు పరుగులు తీశారు. శనివారం అంతా ముసురుతో ఒకవైపువర్షం వస్తున్నా లెక్క చేయకుండా నర్సరీ మేళాకు వచ్చి తమకు కావాల్సిన మొక్కలు తీసుకువెళ్లారు. మొక్కలు పెంచడం అంటే బావితరాలకు మంచి భవిష్యత్తు అందించడమేనని, ప్రకృతిని ప్రేమించడమంటే కొంగొత్త సమాజాన్ని ప్రేమించడమేనని పర్యావరణ ప్రేమికులు స్పష్టం చేశారు.


గురువారం నెక్లెస్రోడ్ పీపుల్స్ప్లాజాలో ప్రారంభమైన ఆలిండియా హార్టికల్చర్, అగ్రికల్చర్షో కు నగర ప్రజలను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శన లో వర్టీకల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్, టెర్రస్ గార్డెనింగ్, వంటి నూతన టెక్నాలజీ ఈ ప్రదర్శన లో ప్రత్యేకంగా నిలిచాయి. కిచెన్, అవుట్ డోర్, ఎక్ సోటిక్ టిక్, బల్బ్, సీడ్, సీడ్ లింక్స్ ,ఇండోర్, ఆడినియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా డార్జిలింగ్, కోల్కతా, ఢిల్లీ, హర్యానా, ముంబయి, బెంగుళూరు, పూణే, షిర్డీ, కడియం, చెన్నై తెలంగాణ, ఆంధ్రా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 150స్టాల్స్ ప్రదర్శిస్తున్నారు. బోన్సాయ్ వృక్షాలు, పూలు, పండ్ల మొక్కలు అబ్బురపరుస్తున్నాయి.

టెర్సస్, హోమ్, బ్యాక్ యార్డ్ గార్డెనింగ్ బీజీగా ఉండే నగర వాసులకు మానసిక ఒత్తిడి తగ్గించి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయని షో ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్ అన్నారు. సోమవారం వరకూ ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఈ షో ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ షో లో మెడిసినల్ ప్లాంట్స్, రకరకాల పండ్లు, పూల మొక్కలు, అగ్రికల్చర్, హార్టీకల్చర్కు అవసరమైన పనిముట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు పెంచుతూ పర్యావరణ పరిరక్షించాలని కోరారు. పర్యావరణాన్ని విస్మరిస్తే ఇప్పుడు వాటర్ బాటిల్స్ కొంటున్నట్లు భవిష్యత్తులో ఆక్సీజన్ బాటిల్స్ కొనుక్కోవాల్సి వస్తుందన్నారు. ఈ మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో నర్సరీ స్టాల్స్ తో పాటు మెడిసినల్ ప్లాంట్స్ , ఫ్రూట్, ఫ్లవర్ ప్లాంట్స్, బల్బ్స్ ప్రదర్శించారు.


