
నమో వందే గోమాతరం నేషనల్ ప్రెసిడెంట్ పెరిక సురేష్
హైదరాబాద్, డిసెంబరు 01
ప్రపంచంలోని అన్ని భాషల సాహితీ గ్రంథాలకు దక్కని అరుదైన ఘనత కేవలం భగవద్గీతకు మాత్రమే దక్కిందని నమో వందే గోమాతరం నేషనల్ ప్రెసిడెంట్ పెరిక సురేష్ అన్నారు. సోమవారం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీలో జరిగిన భగవద్గీత పారాయనానికి సురేష్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఒక గ్రంథానికి జయంతి నిర్వహించటం కేవలం భగవద్గీతకే చెల్లిందన్నారు. యావత్ మానవజాతి బాధల్ని పోగొట్టే శక్తి కేవలం భగవద్గీతకు మాత్రమే ఉందన్నారు. అందుకే భగవద్గీతకు మాత్రమే జయంతి చేయటం ఆచారంగా ఏర్పడిందన్నారు. భగవంతుడితో సమానంగా భగవద్గీత పూజను అందుకున్నదని పేర్కొన్నారు. హిందువులందరూ గీతాసారాన్ని అనుసరించాలని ఉద్భోదించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు అందుకున్నారు.

