
71,387 మందికి లబ్ది.. నెలకు రూ.9.39 కోట్ల అదనపు భారం
హైదరాబాద్, డిసెంబర్ 22:
రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు శుభవార్త లభించింది. 2025 జూలై 1 నుంచి అమలయ్యేలా 17.651 శాతం డియర్నెస్ అలవెన్స్ (DA)/ డియర్నెస్ రిలీఫ్ (DR) ను ఖరారు చేస్తూ రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆమోదం తెలిపారు.

బహిరంగ మార్కెట్లో ధరల సూచీ పెరుగుదల ఆధారంగా ప్రతి ఏడాది జనవరి, జూలై నెలల్లో డీఏ/డీఆర్ను సమీక్షిస్తూ విడుదల చేసే విధానంలో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్తర్వులతో విద్యుత్ సంస్థల పరిధిలోని మొత్తం 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. డీఏ పెంపుతో విద్యుత్ సంస్థలపై ప్రతి నెలా రూ.9.39 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది.
సంస్థల వారీగా లబ్ధిదారులు
టీజీ ట్రాన్స్కో పరిధిలో
- 3,036 మంది ఉద్యోగులు
- 3,769 మంది ఆర్టిజన్లు
- 2,446 మంది పెన్షనర్లు
మొత్తం 9,251 మందికి లబ్ది చేకూరనుంది.
జెన్కోలో
- 6,913 మంది ఉద్యోగులు
- 3,583 మంది ఆర్టిజన్లు
- 3,579 మంది పెన్షనర్లు
లబ్ది పొందనున్నారు.
ఎస్పీడీసీఎల్లో
- 11,957 మంది ఉద్యోగులు
- 8,552 మంది ఆర్టిజన్లు
- 8,244 మంది పెన్షనర్లు
లబ్ధి పొందనున్నారు.
ఎన్పీడీసీఎల్ పరిధిలో
- 9,728 మంది ఉద్యోగులు
- 3,465 మంది ఆర్టిజన్లు
- 6,115 మంది పెన్షనర్లు
డీఏ పెంపు ద్వారా ప్రయోజనం పొందనున్నారు.

మొత్తంగా అన్ని విద్యుత్ సంస్థలను కలిపి 71,387 మందికి ఈ నిర్ణయం ద్వారా లబ్ది చేకూరనుందని అధికారులు తెలిపారు.
