
ఈ నెల 22 నుంచి ఐదు రోజుల పాటు ఐమాక్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రాండ్ నర్సరీ మేళా
బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్: హైదరాబాద్లోని ఐమాక్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఐదు రోజుల పాటు నిర్వహించే 19వ గ్రాండ్నర్సరీ మేళా బ్రోషర్ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. కాంక్రీట్ జంగిల్గా మారుతున్న మహా నగరాల్లో గ్రీనరీ అవసరమని మంత్రి తుమ్మల అన్నారు.
ఈ నెల 22 నుంచి 26 వరకు ఆలిండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా నర్సరీ మేళా ఇంచార్జీ ఖలీద్ అహ్మద్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నర్సరీ ఉత్పత్తులతో ఆలిండియా హార్టీకల్చర్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి కొత్త పద్ధతులను ఈ షోలో ప్రదర్శిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా కోల్కతా, ఢిల్లీ, హర్యానా, ముంబై, బెంగళూరు, ఏపీ, పుణె, షిర్డీ, కడియం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్లాంట్స్తో 120 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మెడిసినల్, కిచెన్, అవుట్ డోర్, బల్బ్, సీడ్, సీడ్ లింక్స్, ఇండోర్, ఆడినియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ప్రదర్శిస్తామని రాష్ట్ర మంత్రులు, హార్టీకల్చర్ ఉన్నతాధికారులు ఈ మేళా ప్రారంభిస్తారని ఖాలీద్ అహ్మద్ వివరించారు.
