
రూ.1.76 లక్షలు పలికిన చదరపు గజం భూమి
నగరంలోని పలు ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు భూముల వేలం
కేపీహెచ్బీ కమ్యూనిటీ హాలులో 14 స్థలాల వేలం
బాలాజీనగర్లో చదరపు గజం రూ.1.64 లక్షలు
హైదరాబాద్ ఫిబ్రవరి 23
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో చదరపు గజం భూమి రూ.1.76 లక్షలు పలికింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములను వేలం వేయగా అధిక ధరలు పలికాయి. కేపీహెచ్బీ కమ్యూనిటీ హాలులో నిర్వహించిన ఈ వేలంలో 50 మంది బిల్డర్లు పాల్గొన్నారు.
గచ్చిబౌలి, బౌరంపేట, కూకట్ పల్లి బాలాజీనగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 స్థలాలను బహిరంగ వేలం వేశారు. ఇందులో గచ్చిబౌలి భూమి చదరపు గజం రూ.1.76 లక్షలు, కూకట్ పల్లి బాలాజీనగర్లో చదరపు గజం రూ.1.64 లక్షలు పలికింది. బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.34.27 కోట్ల ఆదాయం సమకూరింది.
హౌసింగ్ బోర్డు భూములకు మళ్లీ ‘రికార్డు’ డిమాండ్!

గచ్చిబౌలిలో చదరపు గజం రూ.1.76 లక్షలు, కూకట్పల్లి బాలాజీ నగర్లో రూ.1.64 లక్షలు
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ హాట్గా మారింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు (కెపిహెచ్బి) బహిరంగ వేలం ద్వారా విక్రయించిన ప్లాట్లకు అదరగొట్టే ధరలు పలికాయి. గచ్చిబౌలి ప్రీమియం ప్రాంతంలో ఒక ప్లాట్కు చదరపు గజం రూ.1.76 లక్షలు, కూకట్పల్లి బాలాజీ నగర్లో రూ.1.64 లక్షలు చెల్లించి కొనుగోలుదారులు దక్కించుకున్నారు. ఈ వేలం ద్వారా బోర్డుకు రూ.34.27 కోట్ల ఆదాయం వచ్చింది.
ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేసిన హౌసింగ్ బోర్డు, గచ్చిబౌలి, భౌరంపేట్, బాలాజీ నగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 భూములను (ప్లాట్లు, ఫ్లాట్లు) బహిరంగ వేలానికి పెట్టింది. సోమవారం కెపిహెచ్బి కమ్యూనిటీ హాల్లో జరిగిన వేలంలో సుమారు 50 మంది బిడ్డర్లు పాల్గొని తీవ్ర పోటీ పడ్డారు.
హైలైట్స్ ఇలా ఉన్నాయి:

- గచ్చిబౌలిలోని 263 చదరపు గజాల ప్లాట్ (అప్సెట్ ప్రైజ్ రూ.50 వేలు)కు చదరపు గజం రూ.1.76 లక్షల ధర పలికింది.
- కూకట్పల్లి బాలాజీ నగర్లోని 266 చదరపు గజాల ప్లాట్కు చదరపు గజం రూ.1.64 లక్షలకు అమ్ముడైంది.
- చింతల్లోని ఓపెన్ ప్లాట్లకు చదరపు గజం రూ.84 వేలు, రూ.74 వేల ధరలు రికార్డ్ అయ్యాయి.
- భౌరంపేట్లోని 2600 చదరపు గజాల భూమి చదరపు గజం రూ.61 వేలకు విక్రయమైంది.
- నిజాంపేట్లోని సిద్ధి ఫ్లాట్ (అప్సెట్ రూ.15 లక్షలు) రూ.17.70 లక్షలకు, గచ్చిబౌలిలో మరో ప్లాట్ చదరపు గజం రూ.1 లక్షకు అమ్ముడైంది.
బాచుపల్లిలోని ఒక ఫ్లాట్ మినహా మిగిలినవన్నీ ఎంఐజి, హెఐజి కేటగిరీ ప్లాట్లే కావడంతో డిమాండ్ భారీగా ఉందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతం తెలిపారు. “ప్రీమియం లొకేషన్లలో ఉన్న ఈ ప్లాట్లకు భారీ ఆసక్తి ఉంది. ఇది నగర రియల్ ఎస్టేట్ మార్కెట్ బలాన్ని సూచిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ విక్రయాలతో హౌసింగ్ బోర్డు ఆర్థికంగా బలపడినట్లయింది. మరిన్ని వేలాలు రాబోతున్న నేపథ్యంలో, ఇలాంటి రికార్డు ధరలు కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
