
హైదరాబాద్ , సెప్టెంబరు 1
నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా లో ఆరు రోజుల పాటు నిర్వహిస్తున్న అల్ ఇండియా హార్ది కల్చర్, అగ్రికల్చర్ షో నగర ప్రజలను ఆకట్టుకుంటోంది. గురువారం నుంచి నిర్వహిస్తున్న గ్రాండ్ నర్సరీ ప్రదర్శన లో రోబోటిక్ వ్యవసాయం, టెర్రస్ గార్డెనింగ్, వర్టీకల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి నూతన టెక్నాలజీ ఈ ప్రదర్శన లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.


150కు పైగా ఏర్పాటు చేసిన స్టాల్స్లో నర్సరీ స్టాల్స్ మెడిసినల్ ప్లాంట్స్ కిచెన్, అవుట్ డోర్, ఎక్ సోటిక్ టిక్, బల్బ్, సీడ్, సీడ్ లింక్స్ ,ఇండోర్, ఆడినియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అందుబాటులోఉన్నాయి. డార్జిలింగ్, కోల్కతా, ఢిల్లీ, హర్యానా, ముంబయి, బెంగుళూరు, పూణే, షిర్డీ, కడియం, చెన్నై తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నుంచి వచ్చిన ప్లాంట్స్ ప్రదర్శిస్తున్నారు. బోన్సాయ్ వృక్షాలు, పూలు, పండ్ల మొక్కలు అబ్బుర పరుస్తున్నాయి. నెక్లెస్ రోడ్ లో ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు అందుబాటులో ఉంటాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నర్సరీల నుంచి వచ్చిన మొక్కలు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయని మేళా ఇంచార్జ్ ఖాలీద్ అహ్మద్ వివరించారు.






