
హైదరాబాద్ జనవరి 31 2025
మొక్కలు పెంచడం అంటే బావితరాలకు మంచి భవిష్యత్తు అందించడమేనని, ప్రకృతిని ప్రేమించడమంటే సమాజాన్ని ప్రేమించడమేనని పర్యావరణ ప్రేమికులు స్పష్టం చేశారు. శుక్రవారం నెక్లెస్రోడ్పీపుల్స్ప్లాజాలోఆలిండియా హార్టికల్చర్, అగ్రికల్చర్షో మొక్కల ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శన లో వర్టీకల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్, టెర్రస్ గార్డెనింగ్, వంటి నూతన టెక్నాలజీ ఈ ప్రదర్శన లో ప్రత్యేకంగా నిలిచాయి. కిచెన్, అవుట్ డోర్, ఎక్ సోటిక్ టిక్, బల్బ్, సీడ్, సీడ్ లింక్స్ ,ఇండోర్, ఆడినియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా డార్జిలింగ్, కోల్కతా, ఢిల్లీ, హర్యానా, ముంబయి, బెంగుళూరు, పూణే, షిర్డీ, కడియం, చెన్నై తెలంగాణ, ఆంధ్రా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 150స్టాల్స్ప్రదర్శిస్తున్నారు. బోన్సాయ్వృక్షాలు, పూలు, పండ్ల మొక్కలు అబ్బురపరుస్తున్నాయి.



గార్డెనింగ్బీజీగా ఉండే నగర వాసులకు మానసిక ఒత్తిడి తగ్గించి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయని షో ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్అన్నారు. ఫిబ్రవరి 3 వరకూ ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఈ షో జరుగుతందని తెలిపారు.


ఈ షో లో మెడిసినల్ ప్లాంట్స్, రకరకాల పండ్లు, పూల మొక్కలు, అగ్రికల్చర్, హార్టీకల్చర్కు అవసరమైన పనిముట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు పెంచుతూ పర్యావరణ పరిరక్షించాలన్నారు. స్టాల్స్ లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో నర్సరీ స్టాల్స్ తో పాటు మెడిసినల్ ప్లాంట్స్ , ఫ్రూట్, ఫ్లవర్ప్లాంట్స్, బల్బ్స్ ప్రదర్శించారు.
