
నాగర్ కర్నూల్: ఫిబ్రవరి 22, 2025
ఎస్ ఎల్ బీసీ టన్నెల్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం సంభవించింది, నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగం పై కప్పు కూలడంతోఈ ప్రమాదం జరిగింది.
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఉన్న ఎడమ గట్టు కాలువ 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నా రు.
ఇటీవల సోరంగం పనులు ఆపి మళ్లీ తిరిగి 4 రోజులు క్రితం పనులను ప్రారంభించారు. పైకప్పు ఊడిపడటంతో స్వల్ప గాయాలతో కొంత మంది కార్మికులు బయటపడ్డారు. వారిని అక్కడి సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడగా మరికొంత మంది కార్మికులు లోపల ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరిన నీటిపారుదల శాఖ అధికారులు ఘటనపై వివరాలు ఆరా తీస్తున్నారు.
టన్నెల్ ప్రమాదంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ దిగ్ర్భాంతి
నీటిపారుదల సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఐజీ సత్యనారాయణ, ఫైర్ సర్వీసెస్ డీజీ జి.వి. నారాయణ రావులతో కలిసి హెలికాప్టర్లో సంఘటన స్థలానికి వెళ్లిన మంత్రి ఉత్తమ్..సహాయక చర్యల పర్యవేక్షణ
ఎస్.ఎల్.బి.సి ప్రమాదస్థలిలో ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,జూపల్లి కృష్ణారావు లు..టన్నెల్ వద్దకు చేరుకున్న సింగరేణి రిస్క్యూ టీం.ప్రత్యేక ఆక్సిజన్ ద్వారా టన్నెల్ లోకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్న రిస్క్యూ టీం