
వార్షిక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నిక
హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) ఉపాధ్యక్షునిగా పెరిక సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఆదివారం హైదరాబాద్ బోట్ క్లబ్లో ఎస్.ఆర్. ప్రేమ్రాజ్ అధ్యక్షతన జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో సురేష్ కుమార్ – వైస్ ప్రెసిడెంట్గా, విజేందర్ సింగ్ – జాయింట్ సెక్రటరీగా, సురేందర్ జోసెఫ్ – ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను మెరుగుపరచడం, అథ్లెట్ల సంక్షేమం కోసం అసోసియేషన్ చేపట్టే కృషిని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఒలింపిక్ స్ఫూర్తిని ప్రోత్సహించడం, రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చేలా కృషి చేస్తామని సురేష్ తన నిబద్ధతను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రేమ్రాజ్, జనరల్ సెక్రటరీ బాబూరావు, ట్రెజరర్ శివశంకర్ తుమ్కూర్ హాజరై అభినందించారు.


