
హైదరాబాద్, జూన్ 26:
రాష్ట్ర ప్రభుత్వం తొలిరోజు రైతుబంధు రూ.642.52 కోట్ల నిధులను ఎకరం వరకు భూమి వున్న రైతుల ఖాతాలో జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. గుంట భూమి నుంచి ఎకరం వరకు భూమి వున్న 22 లక్షల 55,081 మంది రైతుల ఖాతాలలో జమ నిధులు జమ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన ప్రకారం రైతుబంధు నిధుల జమ ప్రారంభమయింది.ఎకరాల వారీగా ప్రతి రోజు రైతుల ఖాతాలలో నిధులు జమచేయడం జరుగుతుంది.
రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సూచనల పాటించాలి
రైతుబంధు నిధుల విడుదల సంధర్భంగా సీఎం కేసీఆర్ , ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు కు మంత్రి నిరంజన్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
