హైదరాబాద్‌, ఫిబ్రవరి 23
మహాలక్ష్మీ గ్యాస్‌ (MAHALAXMI GAS SUBSIDY)రూ.500 సబ్సిడీని ఈనెల 27 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం (TELANGANA)నిర్ణయించింది. దీనిపై ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40లక్షల మంది మహిళలను ఇప్పటికే గుర్తించారు. ప్రారంభంలో వీరందరికీ మహాలక్ష్మీ పథకం ద్వారా సబ్సిడీ సిలిండర్లను అందించనున్నారు. సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు మహాలక్ష్మీ పథకం మార్గదర్శకాలు రూపొందించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను జల్లెడ పట్టారు. వాటిని ఆధార్‌, రేషన్‌ కార్డులతో సింక్‌ చేసి లబ్ధిదారులను గుర్తించారు. సింక్‌ కానీ దరకాస్తులను తిరస్కించి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. గుర్తించిన లబ్ధిదారులు గత మూడేళ్లుగా ఏడాదికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో గుర్తించారు. అదే డేటా ప్రకారం సబ్సిడీ సిలిండర్లు అందించనున్నారు.

మహాలక్ష్మీ గ్యాస్‌ సబ్సిడీ పథకం మార్గదర్శకాలు ఇవే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆహార భద్రత కార్డులున్న(రేషన్‌ కార్డులు) లబ్దిదారులు ఈ స్కీమ్‌కు అర్హులు.

ప్రజా పాలనలో తప్పని సరిగా గ్యాస్‌ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకుని ఉండాలి.

సిలిండర్‌ డెలివరీ సమయంలోనే లబ్ధిదారులు పూర్తిగా సిలిండర్‌ ధరను చెల్లించాల్సి ఉంటుంది.

ఆయిల్‌ కంపెనీలు నగదు బదిలీ ద్వారా సబ్సిడీ అర్హులైన లబ్ధిదారులకు బదిలీ చేస్తాయి. గ్యాస్‌ కనెక్షన్‌కు లింక్‌ అయి ఉన్న అకౌంట్‌లో నగదు బదిలీ జరుగుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల కోసం ఎల్‌పీజీ కంపెనీలకు నెలవారీ ప్రాతిపదికన ముందస్తుగా అడ్వాన్స్‌ రూపంలో అందిస్తుంది.

సిలిండర్‌ల కేటాయింపు గత మూడేళ్లుగా లబ్ధిదారులు సగటున ఏడాదికి ఎన్ని సిలిండర్లు వినియోగిస్తున్నారో దాని ఆధారంగా సిలిండర్లో కేటాయింపులు చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text