
జూటా మాటలు చెబుతున్నారు
రాష్ట్ర గౌరవాన్ని కించపర్చేలా మాట్లాడుతున్నారు
వారి మాటలను ప్రజలే తిప్పికొట్టాలి
మంత్రి హరీష్రావు పిలుపు
కామారెడ్డిలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన
కామారెడ్డి, మే 28
రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణ ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు విమర్శించారు. జూటా మాటాలు (అబద్ధాలు) తప్ప ప్రతిపక్షాల నోటి వెంట మరో మాట రావడంలేదంటూ విపక్షాలపై మండిపడ్డారు.


ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో 100 బెడ్ల గవర్నమెంట్ హాస్పిటల్ బిల్డింగ్కు హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం గండిమాసానిపేట్ లో నిర్మించిన బస్తీ దవాఖానాను ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో హరీశ్ రావు పైవ్యాఖ్యలు చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు రాష్ట్ర గౌరవాన్ని దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు ప్రకృతి విపత్తుల కంటే ప్రమాదకరంగా తయారయ్యాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను విమర్శలను ప్రజలే తిప్పికొట్టాలని మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు.